ఢిల్లీ లిక్కర్ కేసు: MLC కవితకు మరోసారి బిగ్ షాక్

by GSrikanth |
ఢిల్లీ లిక్కర్ కేసు: MLC కవితకు మరోసారి బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ రిమాండ్‌ను మరోసారి పొడిగించారు. జూన్ 3వ తేదీ వరకూ పొడిగిస్తూ సోమవారం సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును నేడు న్యాయస్థానం పరిగణలోకి తీసుకొని విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెకు సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ తుది తీర్పు వెల్లడించారు.

Read More...

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో అధికార దుర్వినియోగం: ఈటల

Advertisement

Next Story